నారద వర్తమాన సమాచారం
గణేష్ యువసేన .. కొత్తపేట వారి ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల లో భాగంగా 9 వ రోజు సమాజంలో విశిష్ట సేవలు అందించిన పెద్దలకు చిరు సత్కారం……
పల్నాడు జిల్లా, సత్తెనపల్లి పట్టణంలోని కొత్తపేటలో ఉన్న మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద గణేష్ యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల లో భాగంగా 9 వ రోజు మంగళవారం సాయంత్రం సమాజంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి 7 గురికి చిరు సత్కారం గావించారు.పెద్దలు ఇక్కడ గణేష్ యువసేన ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ నవరాత్రుల మహోత్సవం మరియు వివిధ ఉత్సవాలు ఎంతో వైభవంగా సాంప్రదాయ బద్దంగా నిర్వహిస్తున్నారు అని వీరిని అభినందించారు. ఈనాటి కార్యక్రమంలో జవ్వాజి రామమోహనరావు, పోతుగంటి రామకోటేశ్వరరావు,కొత్త లక్ష్మయ్య,పోతుగంటి నరసింహారావు,కంబాల శ్రీనివాసరావు, చౌట సత్యనారాయణ,బెల్లంకొండ నాగ సాయి ప్రసాద్ (సాయి మాస్టర్)లను చిరు సత్కారం గావించారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఇక్కడ 1995 లో ఈ కార్యక్రమాలకు అంకురార్పణ చేసిన యక్కల సాంబశివరావు, జింకా లోకేశ్వరరావు లతోపాటు దివ్వెల శ్రీనివాసరావు పాల్గొన్నారు.గణేష్ యువసేన కమిటీ బాధ్యులు లఘుమవరపు రమేష్,కొప్పురావూరి కాశీ , కాళి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.