నారద వర్తమాన సమాచారం :ప్రతినిధి
మరో సానుభూతి డ్రామాకు తెరలేపిన వైసిపి
భాష్యం ప్రవీణ్
ఓటమి భయంతోనే ఇలాంటి కుట్రలకు తెరలేపుతున్నారు
విపక్షాలపై బురదజల్లే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి
అదే సమయంలో కరెంటు ఎలా పోయిందో
ఇలాంటి జిమ్ముక్కులను రాష్ట్ర ప్రజలు నమ్మే రోజులు పోయాయి
కోడికొత్త శ్రీను ..బాబాయ్ గొడ్డలి పోటు.. ఒకసారి అవకాశం ఇవ్వండి అంటూ. కల్లబొల్లి మాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ రానున్న 2024 ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడానికి హైటెక్ డ్రామాలు ఆడుతున్నాడు అనడంలో ఈ సంఘటన నిదర్శనమని పెదకూరపాడు ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలలో తనను వ్యక్తిగతంగా అంతమందిస్తున్నారని తన తండ్రిని బాబాయిని కూడా ప్రతిపక్షాలే అంత చేశాయని మీడియా సాక్షిగా బయటకు చెప్పి ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి అని రాష్ట్ర ప్రజలను తన మీడియా సోషల్ మీడియా ద్వారా నమ్మించిన విషయాన్ని ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి అమాయక ప్రజలను మోసం చేయడంతో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉండటంతో . అధికారంలో నుండి దిగిపోవాల్సి వస్తుందని భావనతో. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో హైటెక్ డ్రామ మరోసారి ప్రజల సానుభూతి పొందేందుకు సరికొత్త డ్రామాకు తెరలేపటం హాస్య స్పదంగా ఉందన్నారు . పటిష్ట భద్రత నడుమున. తన సొంత సైన్యంతో పాటు రాష్ట్ర పోలీసుల భారీ భద్రతతో. కలిగిన వ్యక్తికి ఇలాంటి సంఘటనలు ఎలా జరుగుతాయో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. అంతేకాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యటిస్తున్న సందర్భంలో విజయవాడ నడిబొడ్డులో కరెంటు ఎలా పోయింది అదే సమయంలో రాయి ఎలా తగిలిందో నిజానిజాలు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి సీటు కోసం జగన్మోహన్ రెడ్డి గతంలో గడిచిన సంవత్సర కాలాలలో ఎలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డాడు ప్రజలందరికీ తెలుసు అన్నారు. సాక్షాత్తు సొంత చెల్లెలు అక్కలు అమ్మ జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఏమైనా చేస్తాడని రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెబుతుంటే.. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎన్ని కుయత్తులు పనిన కుర్చీని ఖాళీ చేయటం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని అనంతరం అన్ని సంఘటనపై సమగ్రవంతంగా దర్యాప్తు చేపిస్తామన్నారు .
Discover more from
Subscribe to get the latest posts sent to your email.