రక్తదాన శిబిరానికి ముఖ్యఅతిథిగా హైదరాబాద్ రేంజ్ డిఐజి డాక్టర్ దుద్దెల శ్రీనివాస్ రాక..
నారద వర్తమాన సమాచారం కామరెడ్డి జిల్లా ప్రతినిధి:మే04,
తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా జన్మదిన సందర్భంగా కర్షక్ బి.ఎడ్ కళాశాల కామారెడ్డిలో ఆదివారం నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ రేంజ్ డిఐజి జైళ్ల శాఖ డాక్టర్ దుద్దెల శ్రీనివాస్ రావడం జరుగుతుందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు.
రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను,అభినందన పురస్కారాలను అందజేయడం జరుగుతుందని అన్నారు.తలసేమియా చిన్నారుల కోసం నిర్వహిస్తున్న రక్తదాన శిబిరానికి యువత పెద్ద ఎత్తున రావాలని మరిన్ని వివరాల కోసం 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.