నారద వర్తమాన సమాచారం
వైఎస్సార్సీపీలో చేరిన బయ్యవరం జనసేన ,టీడీపీ నాయకులు కార్యకర్తలు
కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో చేరికలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి నచ్చి.. ఎంతోమంది వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. క్రోసూరు మండలం బయ్యవరం గ్రామానికి చెందిన జనసేన ,టీడీపీ కార్యకర్తలు, నాయకులు ,శిరసాని శ్రీనివాస రావు, మల్లయ్య, కంబాల నాగేశ్వరరావు, లక్క శ్రీనివాస్ రావు, మందడి శ్రీనివాసరావు, ఆలూరి బసవయ్య, ఆలూరు శేషయ్య, కోసన లక్ష్మణరావు, లక్క నాగేశ్వరరావు, తలారి నరసింహారావు, ఆలూరి బాజీ, ఆలూరి కొండలరావు, సదా మస్తాన్ రావు,తాడి బోయిన అస్సాలాం తదితరులు వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం అందరూ కలసి పనిచేయాలని సూచించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.