
నారద వర్తమాన సమాచారం
తెలుగుదేశం పార్టీ ని వీడి వైసిపి లోకి చేరిక
వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం ముక్కెళ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కి చెందిన 30 కుటుంబాలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా, వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనీల్ కుమార్ యాదవ్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ లో చేరిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి ఈ 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమo, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీ లో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని వారు తెలిపారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.