నారద వర్తమాన సమాచారం
జనసేన ఉన్నచోట వేరేవారికి ‘గాజు గ్లాసు’ ఇవ్వం: ఎలక్షన్ కమిషన్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఎన్నికల సంఘం స్పందించింది. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఇండిపెండెంట్ ఎంపీ,ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించట్లేదని హైకోర్టుకు నివేదిక ఇచ్చింది. గాజు గ్లాసు గుర్తును కొందరు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంపై జనసేన పార్టీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ తాజా స్పందనతో విచారణ ముగిస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.