
నారద వర్తమాన సమాచారం
వైసీపీ ప్రభుత్వానికి ఈసీ షాక్
ఆంద్రప్రదేశ్ ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వానికి ఎన్నికల
సంఘం షాకిచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న
ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు
అనుమతి నిరాకరించింది. ఈ మేరకు
ప్రభుత్వానికి లేఖ రాసింది. తుఫాను, కరవు
కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్ పుట్
సబ్సిడీ, విద్యార్థులకు విద్యాదీవెన కింద
రూ.610 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధుల
విడుదలకు ఈసీ నో చెప్పింది.