
నారద వర్తమాన సమాచారం
నేడు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్న ప్రధాని నరేంద్ర మోడీ
రాజన్న జిల్లా:
మే 08
లోక్ సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇవాళ తెలంగా ణ రాష్ట్రం లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
బీజేపీ అభ్యర్థుల తరుపున ఆయన ప్రచారం నిర్వహిం చనున్నారు. ఈ క్రమంలో ఆయన నిన్న రాత్రి హైదరా బాద్కు చేరుకొని రాజ్ భవన్లో బసచేశారు. ఇవాళ ఉదయం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎములా డ రాజన్నను దర్శించుకుం టారు.
కాగా, ఇవాళ ఉదయం ప్రధాని మోదీ రాజ్ భవన్ నుంచి బేగంపేట విమానా శ్రయానికి బయల్దేరి అక్కడి నుంచి హెలికాప్టర్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరు కుంటారు.
శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించను న్నారు. అనంతరం కరీం నగర్ లోక్సభ అభ్యర్థి బండి సంజయ్కు మద్దతుగా ప్రచార సభలో మోదీ పాల్గొంటారు.
అనంతరం వరంగల్ పార్ల మెంటు బీజేపీ అభ్యర్ధి అరూరి రమేష్ గెలుపు కోరుతూ….ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. మామునూర్ సమీపంలోని లక్ష్మీపురం వద్ద భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు….
Discover more from
Subscribe to get the latest posts sent to your email.