
నారద వర్తమాన సమాచారం
మే :18
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుత్తి మండలం బాచుపల్లి వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టింది..
ఈ ఘటనలో నలుగురు మృచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలంకు చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులు అనంతపురం రాణినగర్ వాసులుగా తెలిసింది. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.