
నారద వర్తమాన సమాచారం
మే :31
జూన్ 3 న మంత్రుల ఛాంబర్లు స్వాదీనం చేసుకుంటాం..
సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ.
ఏపిలో ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న జరగనుంది. అనంతరం కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్నది.
ఈ మేరకు మంత్రుల ఛాంబర్ లను, సహాయకులను అప్పగించాలని సాదారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది.
మంత్రుల ఛాంబర్ల నుండి ఎటువంటి పైల్స్, ఇతర సామాగ్రి తరలించటం పై నిషేదం విధించినట్లు సాదారణ పరిపాలనా శాఖ అధికారులు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు..