Wednesday, July 23, 2025

రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

నారద వర్తమాన సమాచారం

రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

రజనీకాంత్ కు స్టెంట్ వేసిన అపోలో వైద్యులు

రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న చంద్రబాబు

త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష

గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం దెబ్బతినడంతో ప్రముఖ నటుడు రజనీకాంత్ కు చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు స్టెంట్ వేయడం తెలిసిందే. రజనీకాంత్ ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు… రజనీకాంత్ ను ఫోన్ లో పరామర్శించారు. రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ త్వరగా ఆరోగ్యవంతుడవ్వాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

కాగా, రజనీకాంత్ గత రాత్రి ఆసుపత్రిలో చేరడంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రజనీకి ఏమైందో తెలియకపోవడంతో, సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. ఇవాళ చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు రజనీకాంత్ హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో ఊహాగానాలకు అడ్డుకట్ట పడింది.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading