Tuesday, July 29, 2025

పల్నాడు విద్యార్థి లక్ష్య సాధన పేరుతో స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ.. జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు

నారద వర్తమాన సమాచారం

పదవ తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు వినూత్న ఆలోచన
పల్నాడు విద్యార్థి లక్ష్య సాధన పేరుతో స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ

ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ

నరసరావు పేట,

జిల్లాలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ప్రధాన ప్రశ్నలు, సమాధానాలతో కూడిన మెటీరియల్ ను ఆవిష్కరించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ఉచితంగా మెటీరియల్ ను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి పరీక్షలో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతు గత సంవత్సరం ఈ మెటీరియల్ ఎంతగానో ఉపయోగ పడింది అన్నారు.ఈ సంవత్సరం ఇప్పటి నుండి అన్నీ పాఠశాలలు,సంక్షేమ హాస్టల్స్ లో పంపిణీ చేసి 10వ తరగతి ఫలితాలు లో స్టేట్ లో మన జిల్లాని ఉన్నత స్థానం లో ఉంచాలి అని చెప్పారు

ఈ కార్యక్రమంలో
జాయింట్ కలెక్టర్ సూరజ్,జిల్లా రెవెన్యూ అధికారి మురళి, డీఈవో చంద్రకళ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading