నారద వర్తమాన సమాచారం
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
లోక రక్షకుడు ఏసుక్రీస్తు జననం ప్రపంచ మానవాళి అభ్యుదయానికి దోహదపడినట్లు విద్యుత్ శాఖ జేఏవో కె. ఆశీర్వాదం తెలిపారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి నారాయణపురంలోని కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకలకు గ్రామీణ ఏఈ. డి. నాగేశ్వరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. వేడుకలో భాగం ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఆర్ఓ, ఆపరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







