Sunday, March 16, 2025

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు

నారద వర్తమాన సమాచారం

మంగళగిరి

ఎర్రచందనం లారీ పట్టివేత దుంగలు స్వాధీనం

లారీలో ఏ ఫోర్ సైజ్ పేపర్ బండిల్స్ మధ్యలో ఎర్రచందనం దుంగలు

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న మంగళగిరి గ్రామీణ పోలీసులు

లారీ సీజ్, డ్రైవర్ పరారీ

చట్ట విరుద్ధంగా స్మగ్లింగ్ అరికట్టటమే ధ్యేయంగా గుంటూరు జిల్లా పోలీసులు విధి నిర్వహణ

మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ తెలిపారు. బుధవారం మంగళగిరి మండలం కాజా గ్రామ టోల్గేట్ వద్దా అక్రమ రవాణా జరుగుతుందని రాబడిన పక్కా సమాచారంతో మంగళగిరి రూరల్ సీఐ వై శ్రీనివాసరావు, ఎస్సై చిరుమామిళ్ల వెంకట్, వారి సిబ్బంది కలిసి వాహనా తనిఖీల్లో భాగంగా టోల్ ప్లాజా పక్కన ఆగి ఉన్న లారీని పరిశీలించగా సినీ పక్కిని తలదన్నేలా లారీలో 49 ఎర్రచందనం దుంగలు ఏ ఫోర్ సైజ్ పేపర్ బండిల్స్ మధ్య కనిపించకుండా దాచి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించన రూరల్ ఎస్సై సిహెచ్ వెంకట్ లారీ డ్రైవర్ పారిపోవడంతో లారీని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. లారీ చెన్నై నుండి అస్సాం కు వెళ్తున్నట్లు వారు తెలిపారు. ఎర్రచందనం దుంగలు 1200 కేజీలు ఉన్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ మార్కెట్లో సుమారుగా 3.24 కోట్ల రూపాయల గా ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిశీలించి కేసును దర్యాప్తు చేసి దీని వెనుక ఉన్న ఇతర అక్రమ రవాణా దారులు గురించి విచారణలో తెలియాల్సి ఉందని ఆయన తెలిపారు …


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading