పూర్వ విద్యార్థుల సమ్మేళనం .
గుంటూరు.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండల కేంద్రంలో గల లూధరన్ ఉన్నత పాఠశాలలో 1978వ సంవత్సరం 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు యడ్లపాటి వెంకటరమణమూర్తి, అలోకం హరిబాబు ,పుసులూరి రంగాచార్యుల సారధ్యంలో, తోటి విద్యార్థుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోపూరి ప్రభావతి అధ్యక్షత వహించారు. తమకు చదువు నేర్పిన ఉపాధ్యాయులు, గురువులు ఐన జోసఫ్ మాస్టారు ,రాజారావు, కృపావరం,వినతి టీచర్ లను ఘనంగా సన్మానించారు .పలువురు విద్యార్థులు పాల్గొని నాలుగున్నర దశాబ్దాల క్రిందటి బాల్య విషయాలను గుర్తుచేసుకొని పరవశించారు.ముత్యాలరెడ్డి,పోపూరి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.