నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షులు జగన్ దిగ్భ్రాంతి
పల్నాడు జిల్లా :
ముప్పాళ్లలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బొల్లవరం నుంచి కూలీలతో చాగంటివారిపాలెం వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు.
పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరుకునే సమయంలో ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు.
ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.