నారద వర్తమాన సమాచారం
అమూల్యమైన సేవలకు ఆపన్నహస్తం
అనారోగ్యంతో మరణించిన హోంగార్డు కుటుంబానికి అండగా నిలిచిన హోంగార్డులను అభినందించిన పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ జె.వి సంతో ష్
తోటి సహోద్యోగుల కుటుంబాలకు సహాయం చేయడానికి మరణించిన హోంగార్డుకి ఒక్కరోజు వేతనం అందించిన పల్నాడు జిల్లా హోంగార్డులు. అభినందించిన ఎస్పి
తెనాలి రూరల్ పీఎస్ నందు విధులు నిర్వర్తిస్తూ ది.18.02.2025 వ తేదీన HG 582 వై.శ్రీనివాస్ హార్ట్ ఎటాక్ వలన మరణించడం జరిగింది.
అందుకు గాను వై.శ్రీనివాస్ కుటుంబానికి హోం గార్డులు అందరూ వారి ఒక రోజు వేతనం మొత్తం రూ. 5,00,000/- సాయం చేసారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ. 5,00,000/- చెక్కును జిల్లా అదనపు ఎస్.పి శ్రీ జె.వి.సంతోష్ చేతుల మీదుగా శ్రీనివాస్ భార్య అయిన వై.కళ్యాణి కి అందచేశారు.
సాటి హోమ్ గార్డులకు సాయం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పల్నాడు జిల్లా హోమ్ గార్డులను అదనపు ఎస్పి అభినందించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జె వి సంతోష్ తో పాటు హోంగార్డు ఆర్.ఐ యస్.కృష్ణ పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.