

నారద వర్తమాన సమాచారం :సతైనపల్లి :ప్రతినిధి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి బార్ అసోసియేషన్ హాలులో శుక్రవారం జరిగిన బాబు జగ్జీవన్ రావ్ 117 జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడిన జొన్నలగడ్డ విజయ్ కుమార్ న్యాయవాది,
జైభీమ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు
సామాజిక సమానత్వం, హక్కుల కోసం పోరాడిన యోధుడు బాబు జగజ్జీవన్ రావు
జయంతి వేడుకల్లో పాల్గొన్న జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్
ఒకవైపు దేశ స్వతంత్రం కోసం పోరాడుతూనే మరొక వైపు సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడు బాబు జగ్జీవన్ రావు అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన బాబు జగ్జీవన్ రావు 117 వ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో సుదీర్ఘంగా లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన జగ్జీవన్ రావు కార్మిక, వ్యవసాయ, రక్షణ, రైల్వే ఆయా మంత్రిత్వ శాఖలలో అనేక సంస్కరణలు తీసుకొనిరావడానికి కృషి చేశారని ఆయన కొనియాడారు..నేటి యువత, రాజకీయ నాయకులు ఇటువంటి మహనీయుడిని ఆదర్శంగా తీసుకొవాలని సూచించారు. ఆయన స్పూర్తితో జొన్నలగడ్డ విజయ్ కుమార్ అనే నేను సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని కోటు గుర్తు కే ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పలువురు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు బొక్క భాస్కర్ రావ్, దుగ్గి విజయ్ కుమార్, షేక్. సైదా, కొరబండి రాబర్ట్, పెండెం రవి కుమార్, గోపి కృష్ణ, జెల్ది రమేష్, ఎం.దేవరాజ్, దాసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.