
నారద వర్తమాన సమాచారం :ప్రతినిధ
గుంటూరు ఎంపీ సీటు త్యాగంపై కాంగ్రెస్ లో లుక ….లుక….
నిమ్మరాజు చలపతిరావు
రాష్ట్ర విభజన పుణ్యయమా అని గడిచిన 10 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పడుతూ లేస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ లో కాంగ్రెస్ కు పూర్వ వైభవం..తాజాగా ఏపీలో సీఎం జగన్ సోదరి షర్మిల చేతికి పగ్గాలు. ఇదిలా ఉంటే రాజధాని ప్రాంతం గుంటూరు పార్లమెంటు స్థానాన్ని చేజార్చుకోవడంపై కాంగ్రెస్ లో లుకలుకలు బయలుదేరాయి. వాస్తవానికి దివంగత కొత్త రఘురామయ్య, ఆచార్య రంగా…. ఆపై రాయపాటి సాంబశివరావు ఈ త్రిమూర్తులతో ఈ నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోటగా మారింది. అలాంటిది సిపిఐ కి (చే)జార్చడంపై విమర్శలు. సీనియర్ నేత లింగం శెట్టి ఈశ్వరరావు కి ఈ సీటు ఎక్కడ వస్తుందోనన్న భయంతో కొందరు దురుద్దేశపూర్వకంగా చేజార్చారు అంటున్నారు. వాస్తవానికి మంగళగిరి, తాడికొండ, గుంటూరు I సిపిఐ కి ప్రాబల్యం ఉన్న స్థానాలు. లింగంశెట్టికి ఇష్టం లేక పోతే మరో సీనియర్ నేత మస్తాన్ వలి ని బరిలోకి దించినా బాగుండేదని అంటున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.