నారదవర్తమాన సమాచారం
జన జాతరగా డా.చదలవాడ అరవింద బాబు ఎన్నికల ప్రచారం
వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తల కోలాహలంతో జనసంద్రమైన కొత్తపాలెం గ్రామం
రాష్ట్ర భవిష్యత్తుకు చంద్రబాబే గ్యారెంటీ అంటూ డా.అమూల్య ప్రచారం
నరసరావుపేట రూరల్:-
నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన “బాబు ష్యూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ” పథకాలతోనే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్ధి డా.చదలవాడ అరవింద బాబు కుమార్తె డా.అమూల్య పేర్కొన్నారు.నరసరావుపేట మండలం కొత్తపాలెం గ్రామంలో డా.చదలవాడ అరవింద బాబు కుమార్తె డా.అమూల్య,పట్టణ ప్రముఖ డాక్టర్లు డా.హిమజ,డా.హరిక,మండలాధ్యక్షుడు వివ్వేశ్వరరావు,కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రజాగళం జాతర పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.చంద్రబాబు రాక కోసం,ప్రజా పాలన కోసం రాష్ట్రంలోని ప్రతి వర్గమూ ఆశగా ఎదురు చూస్తోందన్నారు.ఎన్నికలకు ముందు అట్టహాసంగా హామీలిచ్చిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరినీ దగా చేశాడని ద్వజమెత్తారు.చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు చూసి జగన్ రెడ్డికి మతి భ్రమించిందన్నారు.అందుకే కనీసం మేనిఫెస్టో కూడా ప్రకటించే పరిస్థితుల్లో లేకుండా పోయాడన్నారు.దగా చేసిన మేనిఫెస్టో కాగితాలను మరోసారి చూపించి మోసానికి సిద్ధపడుతున్నాడన్నారు.బటన్ నొక్కుడు పేరుతో రూ.10 ఇచ్చి రూ.100 కొట్టేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు.రోడ్లు,విద్య,మౌలిక సదుపాయాలు,వ్యవసాయం అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు.మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ఓట్లు అడుగుతున్నాడని డాఅమూల్య ప్రశ్నించారు.అనంతరం సూపర్ సిక్స్ పథకాలకు చెందిన కరపత్రాలను పంపిణీ చేశారు.కూటమి అభ్యర్ధుల్ని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.