సిపిఎం పార్టీ అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ ప్రచార జాత
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా సిపిఎం పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎండీ జహంగీర్ గెలుపును కాంక్షిస్తూ పోచంపల్లి మండలంలో ప్రచార జాతను ప్రారంభించి పట్టణ కేంద్రంలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ప్రచార జాత వాహనాన్ని గ్రామాలలో ప్రచారం చేయడం జరిగిందని సిపిఎం పార్టీ ఎంపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని అన్నారు. నాటి నైజాం కాలంనుండి దోపిడికి గురవుతున్న ప్రజల పక్షాన నిలబడి భూమి కోసం, భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి నిర్మూలన కోసమై పోరాడిన చరిత్ర ఉన్న ఎర్రజెండా నాయకత్వంలో పనిచేస్తున్న బోనగిరి పార్లమెంట్ ఎంపీ సీపీఎం అభ్యర్థి జహంగీర్ నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేసి గత 35 సంవత్సరాల నుండి ప్రజా ఉద్యమాలే తన జీవిత ఆశయంగా పనిచేస్తున్న వ్యక్తి అని నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు వెళ్తూ వాటి సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహిస్తున్న వ్యక్తి అని అలాంటి వ్యక్తిని ఓట్లు వేసి గెలిపిస్తే నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వ అవలంబించిన ప్రజా కార్మిక విధానాలకు ఎప్పటికప్పుడు ఎండగడుతూ పార్లమెంటులో ప్రజల గొంతుకై కార్మికుల హక్కులకై విద్య వైద్య రంగాల పరిరక్షణకై చట్టసభలలో మాట్లాడే వ్యక్తి చాలా అవసరమని అన్నారు. అందుకే ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జాంగిర్ గారికి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు ప్రసాదం విష్ణు, కోట రామచంద్రారెడ్డి, మంచాల మధు, పట్టణ కమిటీ సభ్యులు బుగ్గ లక్ష్మయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.