నారద వర్తమాన సమాచారం
నిర్మల్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ కు పరాభవం
నిర్మల్ జిల్లా
:మే 10
పార్లమెంట్ ఎన్నికల్లో భాగం గా నిర్మల్ జిల్లా బైంసాలో గురువారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార కార్యక్ర మంలో ఓ వర్గానికి చెందినవారు దాడికి పాల్పడ్డారు .
కేటీఆర్ రోడ్ షో స్థలానికి చేరుకోకముందే స్టేజి వద్దకు పెద్ద మొత్తంలో వారు చేరుకున్నారు. కేటీఆర్ రాగానే ఫ్లెక్సీలు ప్రదర్శించి జై శ్రీరామ్ అంటూ నినాదా లు చేశారు.
శ్రీరాముని జోలికొస్తే ఊరుకు నేది లేదు.. ఖబర్దార్ అంటూ నినదించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కేటీఆర్ ప్రసంగిస్తుండగానే ఉల్లిగడ్డలు, టమాటాలు విసిరారు.
ఒక దశలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే కేటీ ఆర్ ప్రసంగాన్ని కొనసాగిం చారు. కేటీఆర్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడికి పాల్పడుతుంటే పోలీసులు అసలు ఉన్నారా ప్రశ్నించారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.