సాయి నగర్ లో గంట పాటు మురాయించిన ఈవీఎం
నారద వర్తమాన సమాచారం: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
మండల పరిధిలోని సాయి నగర్ గ్రామంలో పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఈవీఎం మురాయించడంతో దాదాపు గంటపాటు పోలింగ్ ఆగిపోయింది. దీంతో తహసిల్దార్ వెంటనే సాంకేతిక సిబ్బందిని పంపించి మరమ్మతు చేయించడంతో పోలింగ్ ప్రారంభమైంది. పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి పోలింగ్ కేంద్రం ప్రాంగణం బురదగా మారింది. దీంతో సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభానికి ముందే మట్టితో చదును చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.