పోచంపల్లి అర్బన్ బ్యాంక్ కు రెండు జాతీయ అవార్డులు
సహకార సమ్మాన్ చేతుల మీదుగా అవార్డును స్వీకరిస్తున్న బ్యాంక్ సీఈవో శ్రీనివాస్
నారద వర్తమాన సమాచారం
: భూదాన్ పోచంపల్లి, ప్రతినిధి:
ముంబైలో ఇటీవల భారతరత్న సహకార సమ్మాన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ అర్బన్ బ్యాంకుల సమ్మేళనంలో రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నట్లు పోచంపల్లి అర్బన్ బ్యాంక్ సీఈఓ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. బెస్ట్ ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బెస్ట్ ఎంపీఏ అవార్డులను అందుకున్నట్లు తెలిపారు. బ్యాంక్ చైర్మన్ కర్నాటి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ అవార్డుతో బాధ్యత మరింత పెరిగిందని, భవిష్యత్తులో ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సూరపల్లి రమేష్, డైరెక్టర్లు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.