కాగజ్నగర్లో పులిపిల్లలతో పెద్దపులి సంచారం కలకలం
జూన్ 17, 2024,
కాగజ్నగర్లో పులిపిల్లలతో పెద్దపులి సంచారం కలకలం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో పెద్దపులి తన పిల్లలతో కలిసి సంచారం చేయడం కలకలం రేపింది. కాగజ్నగర్ మండల సమీపంలోని గోంది అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లలతో కలిసి స్థావరం ఏర్పాటు చేసుకుని సమీప ప్రాంతాల్లో సంచరిస్తుందన్నారు. దీంతో సమీప మండలాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు భద్రత చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.