నారద వర్తమాన సమాచారం
ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయం.
ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రగతికి బాట. పేదల సొంత ఇంటి కల నెరవేరనుంది. భవన నిర్మాణ రంగం ఊపందుకుంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల సామాన్యుల భారీ ఊరట లభించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపే అమలలోకి తేచ్చారు. ఫ్రీ శాండ్ పాలసీ అమలు చేస్తూ జీవో నెంబర్ 43 విడుదల చేయడం …బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుంది.
నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే తెలుగుదేశం విధానం. పారదర్శకత, ముందుచూపుతో శాండ్ పాలసీని రూపొందించడం జరిగింది.
గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇసుక మాఫియాను నడిపింది. ఒక్క ఇసుక కుంభకోణం ద్వారానే రూ.50 వేల కోట్లకు పైగా కొల్లగొట్టారు. వైసీపీ నేతలే స్వయంగా ఇసుకాసురు అవతారం ఎత్తి దోచుకున్నారు. పేదలు ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఖర్చు అయితే అందులో ఇసుక కొనడానికే రూ. 3 లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. గృహ నిర్మాణ శాఖకు సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను జగన్ అండ్ కో మింగేశారు.జగన్ బినామీ సంస్థ జేపి వెంచర్స్ చెల్లించాల్సిన మొత్తం నుంచి రూ.800 కోట్లు మినహాయించి ప్రజాధనాన్ని ధారధత్తం చేశారు. వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలకు పైగా ఇళ్లు కట్టొచ్చంటే వారి అవినీతి ఏ స్థాయిలో అవినీతి చేశారో అర్థం చేసుకోవచ్చు.
అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధిస్తూ రాష్ట్ర ప్రజల ప్రగతే ధ్యేయంగా ఈ పాలసీ రూపొందించారు. దీనిపై నిరంతరం విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణ దెబ్బతినకుండా ఉచిత ఇసుక అందిస్తాం. జిల్లాల స్థాయిలో శాండ్ కమిటీలు ఏర్పాటు చేసి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీవోలు, మైనింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఈ విధానంతో పేదల సొంత ఇంటి కల నెరవేరుతుంది అని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.