నారద వర్తమాన సమాచారం
బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంలో ప్రొటోకాల్ రగడ
అలిగి ఆలయం బయట కూర్చున్న మంత్రి, మేయర్
తెలంగాణ
జులై 09
హైదరాబాద్ లోని బల్కం పేట ఎల్లమ్మ కళ్యాణం సందర్భంగా ప్రభుత్వ తరపున మంత్రి కొండా సురేఖ మంగళవారం ఉదయం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
అయితే పట్టువస్త్రాల సమర్పణ సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు, మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆలయం వద్దకు చేరుకున్నారు.
ఆలయ నిర్వాహకులు, అధికారులు పొన్నం, మేయ ర్ ను రిసీవ్ చేసుకోవటంలో నిర్లక్ష్యం వహించారు. ఈ సమయంలో స్వల్ప తోపు లాట చోటు చేసుకోవటంతో మేయర్ కు స్వల్ప గాయాల య్యాయి. దీంతో ప్రోటోకాల్ రగడ వివాదం తలెత్తింది.
ఆలయ నిర్వాహకులు, అధికారుల తీరుపై ఆగ్రహంతో ఆలయం బయట పొన్నం, మేయర్ బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు.
దీంతో ఆలయ చైర్మన్, ఆలయ నిర్వాహకులు అక్కడకు చేరుకొని వారిని సముదాయించి లోపలికి తీసుకెళ్లారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.