నారద వర్తమాన సమాచారం
టిడిపి ఎన్నికల హామీ ప్రకారం అంగన్వాడి టీచర్లకు, హెల్పర్లకు వేతనాలు పెంచాలనీ, గ్రాట్యూటీ అమలు చేయాలనీ, ఇతర సమస్యలు పరిష్కరించాలని మహిళా, శిశు సంక్షేమ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కి వినతి పత్రం అందించిన ఇఫ్టూ అంగన్వాడీ సంఘం నాయకులు
అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, గ్రాట్యూటి అమలు చేస్తామని టిడిపి ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని చేయాలని కోరుతూ మంగళవారం ఐ ఎఫ్ టీ యూ అనుబంధం ఏపీ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ నాయకులు మహిళా మరియు స్త్రీ శిశు సంక్షేమం మరియు గిరిజన శాఖా మంత్రి గుమ్మడి సంధ్యా రాణి కి వెలగపూడి సచివాలయంలో వినతిపత్రం అందించారు.*
2023 డిసెంబర్ 12 నుండి 2024 జనవరి 22 వరకు రాష్ట్రంలోని అంగన్వాడీలు సి ఐ టి యు ,ఎ ఐ టి యు సి , ఐ ఎఫ్ టి యు , సంఘాల నేతృత్వంలో సమ్మె చేశారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు అప్పటి ప్రభుత్వం తీవ్ర నిర్బంధాలను ఉపయోగించింది. ఎస్మా చట్టాన్ని విధిస్తూ అనేక మందిని డిస్మిస్ చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా అంగన్వాడీలు ఐక్యంగా సమ్మె కొనసాగించడంతో కొన్ని పాక్షిక అంశాలను అంగీకరిస్తూ జీవోలను జారీ చేసింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.