Friday, September 19, 2025

తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

నారద వర్తమాన సమాచారం

తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వ హించారు. ఈ సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి విద్యా బోధన, వారి భవిష్యత్తును ఉజ్వలంగా రూపుదిద్దే బాధ్యత ఉపాధ్యాయుల చేతిలో ఉన్నదని వివరిం చారు. అందుకే తెలంగాణ భవిష్యత్తు తమ చేతిలో కాదు.. ఉపాధ్యాయుల చేతిలో ఉన్నదని తాను విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు.

అందుకే తాము పదవీ బాధ్యతలు తీసుకున్న ఎల్బీ స్టేడియంలోనే ఉపాధ్యాయు లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ప్రొఫెసర్ కోదండరాం, అధికారులకు విజ్ఞప్తి చేశామని వివరించారు.

రాష్ట్ర ప్రజలు 30 వేల ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపి, వారి భవి ష్యత్‌ను ఉపాధ్యాయుల చేతిలో పెట్టారని, వారి భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్ అని తెలిపారు. తెలంగాణ నిర్మాణం, జాతి నిర్మాణం కోసం ఉపాధ్యా యులు కృషి చేస్తున్నారని వివరించారు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటానికి, రాష్ట్ర సాధనలో టీచర్ల పాత్ర విస్మరించలేనిదని, తెలంగాణ ఉద్యమం నిస్తేజ స్థితికి వెళ్లినప్పుడు పొలిటి కల్ జేఏసీ బాధ్యతలు ప్రొఫె సర్ కోదండరాం తీసుకుని ముందుకు వెళ్లామని, వారు కూడా విద్యార్థులకు పాఠాలు చెప్పినవారేనని తెలిపారు.

గ్రామాల్లో ప్రజలు తమ గౌరవం కోసమో.. పిల్లలకు మంచి చదువు వస్తుందనో ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ పరిస్థితులను మార్చాలని, ఇందుకు ఉపాధ్యాయులు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ పాఠశాలలకు పిల్ల లను పంపడం ఆత్మగౌరవం గా ప్రజలు భావించేలా మార్పు తీసుకు రావాలని సూచించారు. తెలంగాణలో 30 వేల ప్రభుత్వ పాఠశాల లు ఉంటే అందులో 26 లక్షల విద్యార్థులు చదువు కుంటున్నారని, అదే పది వేల పైచిలుకున్న ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల విద్యార్థులు చదువుతు న్నారని, ప్రభుత్వ పాఠశాల ల్లో అడ్మిషన్లు గతేడాది కంటే 2 లక్షలు తగ్గాయని తెలిపారు.

అందుకే తాము విద్యా శాఖను పటిష్టం చేయాలని, పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలనే నిర్ణయంతో బడ్జెట్ కేటా యింపులు పెంచామనపి వివరించారు. ఈ ఏడాది రూ. 21 వేల కోట్లు విద్యకు నిధులు కేటాయించామని పేర్కొన్నారు.

అదే విధంగా విద్యా శాఖకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు ప్రకటించారు. ప్రతి పాఠశాల కు పారిశుధ్య కార్మికులను అపాయింట్‌మెంట్ చేయాల ని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినప్పుడు పేదలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నప్పుడు పాఠశాల లకు ఎందుకు ఇవ్వొద్దని ఆలోచించామని, పాఠశాలలకు ఉచితంగా విద్యుత్ అందిం చాలని అధికారులను ఆదేశించా మని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే తాను ఈ స్థాయికి వచ్చానని, అందుకే ప్రభుత్వ ఉపాధ్యాయులను తాను సంపూర్ణంగా విశ్వసి స్తానని సీఎం వివరించారు. కేజ్రీవాల్ విద్యా వ్యవస్థను మెరుగుపరచడం వల్లే మూడు సార్లు అధికారం లోకి వచ్చారని గుర్తు చేశారు.

మళ్లీ ఒకసారి నన్ను ఇక్కడ చూడాలంటే.. మళ్లీ తెలం గాణలో ప్రజా ప్రభుత్వం రావాలంటే మీరు పని చేయాలి. పేదలు ఆత్మ గౌరవంతో బతకా లంటే.. దొరల గడీల నుంచి దూరం ఉండాలంటే మీరు పని చేయాలి. పేద పిల్లలకు మంచి చదువులు చెప్పాలి. నా బాధ్యత మీదే. మీరే మా ప్రభుత్వానికి బ్రాండ్ అంబా సిడర్లు. మిమ్మల్ని మేం సంపూర్ణంగా విశ్వసిస్తు న్నాం.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కంటే తెలంగాణ వచ్చాక ఉద్యోగుల పరిస్థితులు దిగజారాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘బాషా పండిట్లకు 20 సంవత్సరాలుగా ప్రమోషన్లు లేవు. మిగిలినవారికి 10 నుంచి 15 ఏళ్ల నుంచి ప్రమోషన్లు లేవు. మా జీవిత కాలంలో ఒక్కసారైనా ప్రమోషన్ చూస్తామా? అని ఉపాధ్యాయుల్లో ఆందోళన ఉన్నదని తెలుసు’ అని సీఎం తెలిపారు. అందుకే తాము ప్రమోషన్లు ఇచ్చామని వివరించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version