Friday, May 15, 2026
spot_img

భూదాహంతోనే పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు: ప్రత్తిపాటి

నారద వర్తమాన సమాచారం

భూదాహంతోనే పాస్‌పుస్తకాలు, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు: ప్రత్తిపాటి

మూడు పూటలా పేదవాడి ఆకలి తీర్చేలా అన్న క్యాంటీన్లలో ఏర్పాట్లు: ప్రత్తిపాటి

చిలకలూరిపేటలో అన్న క్యాంటీన్ భవనాలను పరిశీలించిన ప్రత్తిపాటి

అంతులేని భూదాహంతోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజల ఆస్తుల పాస్‌ పుస్తకాలు, సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకున్నారని కూటమి ప్రభుత్వం ఆ తప్పలన్నీ సరిచేస్తోందన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. రాజముద్ర, క్యూఆర్‌ కోడ్‌తో కూడిన కొత్త పాస్ పుస్తకాలు ఎవరి భూములు వారివే అన్న నమ్మకాన్ని కలిగిస్తాయని, ఆ దిశగా నిర్ణయం తీసుకున్న మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారాయన. ఇప్పటికే ఎన్నికలకు ముందుఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని, తాజా నిర్ణయంతో ఇక ప్రజలంతా నిశ్చింతగా ఉండొచ్చన్నారు. అదే సమయంలో ఇచ్చిన మాట మేరకే స్థానిక సంస్థల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించడం కూడా ఎంతోమందికి మేలు చేయనుందన్నారు ప్రత్తిపాటి. బుధవారం చిలకలూరిపేటలో అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు. స్థానిక గడియార స్తంభం సెంటర్, ఎన్‌ఆర్‌టీ సెంటర్, అడ్డరోడ్ సెంటర్‌లోని అన్న క్యాంటీన్ భవనాలను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజల ఆకలి ఎలా తీర్చాలని చంద్రబాబు గత ప్రభుత్వంలో అన్న క్యాంటీన్లు పెడితే, వారి ఆస్తులు ఎలా దోచుకోవాలా అని దుర్భుద్ధితో జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్, పాస్ బుక్కులు, సర్వే రాళ్లపై తన బొమ్మలు తెచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఇచ్చిన హామీ మేరకే ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పునఃప్రారంభిస్తు న్నాంమని… పేదలకు మూడు పూటల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఇకపై ఈ కార్యక్రమం సాగ బోతోందన్నారు ప్రత్తిపాటి. ఇలాంటి అన్న కేంద్రాల మూతతో జగన్‌రెడ్డి పైశాచికత్వం ఈ రాష్ట్ర ప్రజలకు ఐదేళ్లలో అర్థమైందన్నారు. తెదేపా ప్రభుత్వం వచ్చే వరకు చిలకలూరిపేటలో సొంత నిధులతో 2అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదవాడి కడుపు కూడా నింపడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ద్వారానే 3 అన్న క్యాంటీన్లను నిర్వహించనున్నాం అని తెలిపారు ప్రత్తిపాటి. ఒక పట్టణంలో 3 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం రాష్ట్రంలో చాలా అరుదని, ఆనాడు తాను మంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరిపేటకు 3 అన్న క్యాంటీన్లను తీసుకురావడం జరిగిందన్నారు. అలానే త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ ద్వారా చిలకలూరిపేట పట్టణంలో మూకుమ్మడిగా ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ఏ వార్డుకు ఆ వార్డులో రోడ్లపై ఆక్రమణలకు పాల్పడ్డారో వాటిని తొలగిస్తామన్నారు. ఇప్పటికే ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ మొదలుపెట్టామని, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అక్రమ నిర్మాణాలను తొలగించుకోవాలని సూచించారు. లేకపోతే మున్సిపల్ సిబ్బందే వాటిని తొలగిస్తారన్నారు. ఈ 2, 3 రోజుల్లో అన్ని సచివాలయాల సిబ్బందికి కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ వార్డుకు ఆ వార్డులో ప్రజల సౌకర్యార్థం ఆక్రమణలను తొలగిస్తామని, 10 మందికి బాధ కలిగించవచ్చునేమో గానీ 90 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉండే అవకాశం ఉంటుందన్నారు. అన్ని సచివాలయాల పరిధిలో ఎవరెవరు రోడ్లపైకి వచ్చి ఆక్రమించుకొని ఉన్నారో వాటన్నింటినీ కూడా తీయించడంతో పాటు రోడ్లపై వాహనాలకు ఎటువంటి అసౌకర్యం, ఆటంకాలు లేకుండా తిరిగేలా వాహనదారులకు ఇబ్బంది లేకుండా సచివాలయాల ద్వారా కమిషనర్ ఆధ్వర్యంలో అవసరమైతే పోలీస్ సహాయంతో రాజకీయాలకు అతీతంగా ఒక ప్రత్యేక డ్రైవ్ చేపడతామని వివరించారు. పట్టణంలోని కొన్ని బజార్లలో ద్విచక్రవాహనాలు వెళ్లడానికి కూడా ఇబ్బందికరంగా ఉందన్నారు. అటువంటి పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలంటే ఆక్రమణల్లో ఉన్నటువంటి వారు సహకరించాల్సిన అవసరం కూడా ఉందన్నారు. అన్ని సచివాలయాల పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి పట్టణ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ఆక్రమణల్లో ఉన్నవారు కూడా సహకరించాలని కోరారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading