నారద వర్తమాన సమాచారం
పల్నాడుజిల్లాపోలీసుకార్యాలయం,
నరసరావుపేట.
ఎటువంటిఅవాంఛనీయఘటనలు జరగకుండా వినాయకఉత్సవాలనుజరిపించాలి..
జిల్లాలోని పోలీసుఅధికారులతో మరియు మహిళా పోలీసులతో జూమ్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారామాట్లాడిన జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాసరావుఐపీఎస్.,
వినాయక మండపాల నిర్వహణ మరియు పర్మిషన్ల జారి, ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడం, గతంలో వినాయక చతుర్థి నాడు నమోదు అయిన కేసుల వివరాలను మరియు ప్రస్తుతం పండుగ రోజు జరగబోవు గొడవల గురించి, నిమజ్జనం రోజు ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చేపట్టవలసిన చర్యలపై, నిమజ్జనం జరుగు ప్రదేశంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై మరియు ఏర్పాట్లపై అన్ని స్టేషన్ల అధికారులతో ఎస్పీ చర్చించినారు.
ప్రతి గ్రామంలో, వార్డులలో ఏర్పాటు చేసే ప్రతి విగ్రహానికి పర్మిషన్ తీసుకునేలా మరియు ఆన్లైన్ ద్వారా పర్మిషన్ కి ఎలా అప్లై చేయాలో అవగాహన కల్పించాలని మహిళా పోలీసులకు ఎస్పీ గారు సూచించారు. వినాయక మండప కమిటీ సభ్యులలో ఎవరైనా రౌడీషీటర్లు ఉన్నారా, పోలీస్ స్టేషన్ పరిధిలో ఏవైనా గొడవలు జరుగుతాయా అనే అంశాలపై మహిళా పోలీసులతో ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.