నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ ఆఫీస్ నందుభారతరాజ్యాంగా ఆమోద దినోత్సవాన్ని ఘనంగానిర్వహించిన మునిసిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్
పిడుగురాళ్ల :-
గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ నందు 75వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ మాట్లాడుతూ
ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహనీయుడు అంబేద్కర్ ప్రతి ఒక్కరు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకోవాలని అని అన్నారు
పిడుగురాళ్ల పట్టణ మున్సిపల్ కార్యాలయంలో డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మేనేజర్ మోహిద్దిన్, సీనియర్ అసిస్టెంట్ నవీన్, సీనియర్ అసిస్టెంట్ రంజిత్, మరియు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.