నారద వర్తమాన సమాచారం
ఏపీ క్యాబినెట్ లో కొత్త మంత్రులుగా ‘నాగబాబు, పల్లా’.!
జనవరి 8వ తేదీన ప్రమాణస్వీకారం.!!
ఇద్దరు ‘యువ మంత్రులు’ అవుట్.?
అమరావతి :
ఆంధ్ర ప్రదేశ్ లో కేబినెట్ పునర్ వ్యవస్దీకరణకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సిద్దమవుతున్నారు.
ఏపీ కేబినెట్లో ప్రస్తుతం ‘ఒకే ఒక్క’ మంత్రి పదవి ఖాళీగా ఉంది. దీన్ని నాగబాబుకు ఇచ్చేందుకు చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు.
మరో పదవిని అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నారు.
కేబినెట్లో ఉన్న మంత్రుల్లో అంచనాలను అందుకోని ఇద్దరిపై వేటు కు సిద్దమైనట్లు తెలుస్తోంది. వారిలో వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇక ఎపీను అగ్రస్థానంలో నిలిపేందుకు గాను, అభివృద్ధి లో వేగంగా పరుగులు తీసేందుకు చంద్రబాబు సమాయత్తం కాబోతున్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.