నారద వర్తమాన సమాచారం
రాజుపాలెం మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఐఏఎస్
రాజుపాలెం:-
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు మంగళవారం ఉదయం రాజుపాలెం మండలంలో
పర్యటించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఎంపీపీ పాఠశాలకు కో లోకెట్ చేసిన అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠాలు అర్థమవుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. స్టడీ మెటీరియల్ ను చక్కగా వినియోగించుకుని విద్యార్థులంతా వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు.
ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస స్థాయిలను పరీక్షించారు. పాఠశాలలో రికార్డులు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ పర్యటనలో డీఈవో చంద్రకళ, సత్తెనపల్లి ఆర్డీవో రమణా కాంత్ రెడ్డిలు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.