నారద వర్తమాన సమాచారం
చత్తీస్ ఘడ్ బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్ కౌంటర్?
: ఫిబ్రవరి 01
ఛత్తీస్గఢ్లో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కాలంలో వరుస దెబ్బలు తగులుతున్నాయి. అయినా గుణపాఠం నేర్చుకోవడం లేదు…
ఓ వైపు భద్రతా సిబ్బంది దాడులు చేస్తున్నా… మావోలు మాత్రం కార్యక లాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతం అయ్యారు.
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు.
ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయా రని పోలీస్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఎన్కౌంటర్పై మరింత సమాచారం రావాల్సి ఉంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.