నారద వర్తమాన సమాచారం
చెత్తను సేకరించి జీవిస్తున్న వారికి ఉపాధి కల్పించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు. ఐఏఎస్ ఎస్పీ కంచి శ్రీనివాసరావు. ఐపీఎస్
నరసరావుపేట
చెత్తను సేకరించి జీవిస్తున్న వారు ఆ పని మానుకొని వేరే పనులకు వెళ్లి విధంగా మార్పు చెందాలని, ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, జిల్లా ఎస్పీ కే శ్రీనివాసరావు వారికి సూచించారు.
మంగళవారం దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నరసరావుపేట పట్టణంలో ఉన్న చంద్రబాబు నాయుడు కాలనీలో రోడ్లపై చెత్తను సేకరించి జీవిస్తున్న ఇద్దరు మహిళలకు మూడు చక్రాల బండ్లు పంపిణీ చేశారు. భవిష్యత్తులో వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించి ప్రభుత్వం అందించే విద్యను కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందుకుని , మీ పిల్లలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ పి.అరుణ బాబు,ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు ప్రభుత్వ పాఠశాలలకు మీ పిల్లలను పంపించాలని, మీ పిల్లల భావితరాలకు పునాదులు వేయడానికి తల్లిదండ్రులు పిల్లలకు సపోర్టుగా నిలవాలని, అంగన్వాడి సెంటర్లో ఉన్నటువంటి సేవలు మీరు పొందాలని ఆ దిశగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకోవాలని అన్నారు . డి బి ఆర్ సి సంస్థ చేస్తున్న కార్యక్రమాలను కలెక్టర్, ఎస్పీ, డిఆర్ఓ, ఆర్ డి ఓ లు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ నరసరావుపేట సిటీ కోఆర్డినేటర్ తోకల సాంబయ్య, డిఆర్ఓ మురళి ఆర్డిఓ మాధవి లత మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.