నారద వర్తమాన సమాచారం
యుఎస్ నుంచి తొలివిడతలో భారత్ చేరిన 104మంది.. ఎవరిని కదలించినా కన్నీటి కథలే..!
అమెరికా హోంలాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు…
వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. బలవంతంగా అమెరికా నుంచి పంపించి వేయడంతో గురువారం భారత్ చేరుకున్న 104 మంది భారతీయుల పరిస్థితి దారుణంగా తయారయ్యింది!
డాలర్ డ్రీమ్స్ ఆవిరయ్యాయి…
తమ వాళ్ల ఆచూకీ కోసం ఇన్నాళ్లు తల్లడిల్లిన ఆప్తులు అమృత్సర్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్కు చెందిన 33 మంది, పంజాబ్కు చెందిన 30 మంది, మహారాష్ట్ర, చండీఘడ్కు ముగ్గురు చొప్పున భారత్ కు తిరిగి వచ్చారు!
అమెరికాకు ఎన్నో ఆశలతో వెళ్లామని, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదనీ పేర్కొంటున్నారు. 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి వెల్లినట్లు చెబుతున్నారు ఈ అక్రమ వలసదారులు!!
తమ కొడుకుకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తానని హామీ ఇచ్చి అమెరికాకు పంపామని కుటుంబసభ్యులు భోరుమన్నారు. కానీ ఇప్పుడు అతను ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడని చెప్పారు. తమ కల చెదిరిపోయిందని, ఇప్పుడు ఈ భారీ అప్పును ఎలా తీర్చాలో ఆలోచిస్తున్నామని అంటున్నారు. మొత్తం మీద, ఒకవైపు, వారి కొడుకు తిరిగి రావడంతో కుటుంబం సంతోషంగా ఉండగా, మరోవైపు, అప్పుల భారం వారి తలపై ఉంది. ఎవరి కథ వారు వినిపిస్తూ కన్నీటిపర్యవంతమయ్యారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.