నారద వర్తమాన సమాచారం
ఆదివాసి జేఏసీ గిరిజన సంఘం అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బందుకు పిలుపు….
కూనవరం మండల :-
ఆదివాసి జెఎసి,ఆదివాసి గిరిజన సంఘం,అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో 11,12 తేదీలలో రాష్ట్రవ్యాప్త మన్యం బందుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా 11వ తారీకు ఉదయం 4 గంటల నుండి 12వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు సంపూర్ణ బంధు ప్రకటిస్తున్నాము. కావున ముఖ్యంగా మండల రైతంగానికి, ఆటో యూనియన్ వారికి, మ్యాజిక్ యూనియన్ వారికి, వ్యాపారస్తులకు,హోటల్స్ వారికి, ప్రభుత్వ కార్యాలయాలకు,విద్యాసంస్థల వారికి,వివిధ పత్రికల రూపంలోనూ, మా నాయకులందరూ స్వయంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది.కావున రేపటి నుండి స్వచ్ఛందంగా కూలీలను తీసుకురావడం చేయొద్దని, వ్యాపారస్తులు స్వయంగా బందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ బందులో ప్రతి ఒక్కరూ సహకరించి మా ఈ పోరాటంలో భాగస్వాములు అవుతారని,గ్రామాలలో ఆదివాసీ సమాజమంత స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.