నారద వర్తమాన సమాచారం
స్టూవర్టుపురం నుంచి మొదలై.. యూనివర్సిటీ వీసీగా ఎదిగిన మహిళ : సాతుపాటి ప్రసన్న శ్రీ
సినిమాల్లో ఆ ఊరి పేరు మీద జోకులు వేసేవారు. సామాజికవేత్త లవణం, హేమలత తదితర ప్రముఖల కృషి కారణంగా అక్కడుండే చాలామంది మారిపోయి, చదువుకొని ఉద్యోగాలు పొంది, ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అలాంటి ఊరి నుంచే వచ్చిన ఓ గిరిజన మహిళ తొలిసారి ఓ యూనివర్సిటీకి వీసీగా మారారు. ఆమే సాతుపాటి ప్రసన్నశ్రీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను రాజమండ్రిలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమించారు. రాష్ట్రంలో వీసీగా నియమితురాలైన తొలి గిరిజన సామాజికవర్గ మహిళ ఆమే కావడం విశేషం
స్టూవర్టుపురానికి చెందిన ఆమె తండ్రి ప్రసాదరావు రైల్వేలో వైద్యాధికారి. తల్లి వసుంధరాదేవి. సర్దార్ పటేల్ మహావిద్యాలయలో పీహెచ్డీ చేసిన ఆమె తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం మొదలుపెట్టారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.