నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట లింగంగుంట్ల వద్ద గల ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు ఐఏఎస్…
నరసరావుపేట :
సోమవారం ఉదయం పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి. అరుణ్ బాబు నరసారావుపేట,లింగంగుంట్ల వద్ద గల ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సదరన్ సర్టిఫికెట్ల పరిశీలనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకి ఎంతమందికి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరుగుతున్నది సంబంధిత ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రంగారావు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పేషంట్లతో ముచ్చటించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోజుకి ఎంతమందికి పరీక్షలు చేస్తున్నారు అనే దానిపై డాక్టర్ రంగారావు మాట్లాడుతూ జిల్లాలో ఐదు ప్రాంతాలలో నరసరావుపేట, చిలకలూరిపేట, గురజాల, వినుకొండ మరియు సత్తెనపల్లిలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతున్నదని రోజుకి వందమంది విజువల్ సర్టిఫికెట్లు మరియు 70 మంది అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి కేంద్రంలో పరిశీలించడం జరుగుతున్నదని వివరించారు. పరిశీలించిన సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగారావు, మరియు సిబ్బంది ఇతరులు పాల్గొన్నారు…
Discover more from
Subscribe to get the latest posts sent to your email.