Wednesday, March 12, 2025

2025 మార్చి పదో తరగతి సార్వత్రిక విద్య పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన డీఈవో ఎల్.చంద్రకళ

నారద వర్తమాన సమాచారం

2025 మార్చి పదో తరగతి సార్వత్రిక విద్య పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించిన డీఈవో ఎల్.చంద్రకళ

పదవ తరగతి (దూర విద్య) సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యం లో జరగబోయే మార్చి 2025-పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన 14 అధ్యయన కేంద్రాల నుండి మొత్తం 1200 మంది విద్యార్ధులు (రెగ్యులర్ & ప్రైవేటు) (బాలురు-675, బాలికలు-525), 27 పరీక్షా కేంద్రాలో పరిక్షలకు విద్యార్థులు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి 27- చీఫ్ సూపరింటెండెంట్ & 27- డిపార్టుమెంటు ఆఫీసర్, 28 మంది సిట్టింగ్ స్క్వాడ్ లను 57 ఇన్విజిలేటర్ లకు నియమించటం జరిగింది. తదుపరి జిల్లా స్థాయీ ఒక రోజు శిక్షణా కార్యక్రమం, ది.11-03-2025 న, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకరభారతి పురం లింగంగుంట్ల, నరసరావు పేట నందు ఉ.10:00 గం .లకు జరిగినది. సార్వత్రిక విద్యా పీఠం పదవ తరగతి (దూర విధ్య) మార్చి, 2025- పబ్లిక్ పరీక్షలు17.03.2025 నుండి 28.03.2025 వరకు ఉదయం
.9:30 మధ్యాహ్నం
12:30 వరకు
చీఫ్ సూపరింటెండెంట్ & డిపార్టుమెంటు ఆఫీసర్ లకు వారి విధులు/ కర్తవ్యాలను పూర్తిగా సార్వత్రిక విద్యా పీఠం కరదీపిక ద్వారా వివరించడం జరిగినది. జిల్లాలోని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులకు వారి పరిధి లోని పరీక్షా కేంద్రాల లోని అన్ని వసతులను పరిశీలించవలసినదిగా అదేశించడమైనది. మరియు సంభందిత తహసీల్దారుల సహకారంతో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి పరీక్షలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించవలసినదిగా జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్. చంద్రకళ ఆదేశించినారు. అసిస్టెంట్ కమీషనర్ & గవర్నమెంట్ ఎగ్జామ్స్ మరియు జిల్లా సార్వత్రిక విద్యా పీఠం సమన్వయ కర్త కెయంఎ హుసేన్ మరియు జిల్లా లోని ఇద్దరు ఉప విద్యాశాఖాదికారులు నరససరావుపేట యస్. యం. సుభాని సత్తెనపల్లి డివిజన్ వి. ఏసుబాబు మరియు రిసోర్స్ పర్సన్ గా బి. వి. యల్. వర ప్రసాద్, హెడ్ మాస్టర్ కండ్లకుంట వ్యహరించారు. విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించనా చీఫ్ సూపరింటెండెంట్/ డిపార్టుమెంటు ఆఫీసర్/ సిట్టింగ్ స్క్వాడ్/ఇన్విజిలేటర్ లకు ACT NO.25 OF 1997 ప్రకారము తగు చర్యలు తీసుకొనబడునని, కావున అందరూ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యం లో జిల్లాలో జరిగే పదవ తరగతి మార్చి 2025- పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా ఎటువంటి లోపాలు లేకుండా విద్యార్ధులకు ప్రశాంత వాతావరణం లో నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్. చంద్రకళ ఆదేశించారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

Loading spinner
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version