నారద వర్తమాన సమాచారం
రాబోయే 5 ఏళ్లలో ఏపీలో 6,702 కొత్త డెయిరీలు: అమిత్ షా
దేశవ్యాప్తంగా పాలు, పాల ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించిందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. రాజ్యసభలో ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన రాత పూర్వకంగా బదులిచ్చారు. శ్వేత విప్లవం 2.0లో భాగంగా దేశవ్యాప్తంగా 56,586 కొత్త డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 6,702 కొత్త డెయిరీ సహకార సంఘాలు ఏర్పాటు చేస్తాం. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు(ఎన్టీడీబీ) ఆధ్వర్యంలో వీటిని నెలకొల్పుతాం. మొత్తం పాల ఉత్పత్తిలో ఏపీ వాటా 6 శాతం అని అమిత్ షా తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.