Tuesday, June 10, 2025

భవ్య సిమెంట్స్ మరియు చేట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉద్యోగ కల్పనలో పొలాలు ఇచ్చిన స్థానిక రైతు కుటుంబాలలో అర్హత ఉన్నవారికి ప్రాదాన్యతనివ్వాలి. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

నారద వర్తమాన సమాచారం

భవ్య సిమెంట్స్ మరియు చేట్టినాడ్ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉద్యోగ కల్పనలో పొలాలు ఇచ్చిన స్థానిక రైతు కుటుంబాలలో అర్హత ఉన్నవారికి ప్రాదాన్యతనివ్వాలి. జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు


యాజమాన్యాలు గ్రామస్తుల ఆసరాలను గుర్తించి సి.యస్.ఆర్ నిధులు వినియోగించాలి….కలెక్టర్ అరణ్ బాబు, యస్.పి. కంచి శ్రీనివాసరావు.
కంపెని యాజమాన్యాలు మరియు స్తానికలు లేవనెత్తిన న పలు అంశము లపై అధికారులతో కమిటి ఏర్పాటు… కలెక్టర్ అరణ్ బాబు
కమిటి 10 రోజులలో నివేదిక ఇవ్వాలి…. కలెక్టర్ అరణ్ బాబు,
అర్హత ఉన్న వారికి శాశ్వత నియామక పత్రాలు ఏప్రిల్-1,2025 నుండి అమలు అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలి… కలెక్టర్ అరణ్ బాబు, యస్.పి. కంచి శ్రీనివాసరావు.భవ్యా, చేట్టినాద్ సిమెంట్ ఫ్యాక్టరీలు ఏర్పాటుకై పొలాలు ఇచ్చిన రైతు కుటుంబములో అరుహులైన వారికి విధిగా ఉపాధి కల్పించి స్థానికులకు ప్రాధాన్యత నివ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీ.పి.అరుణ ఆయ కంపెనీ ప్రతినిధులను కోరారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని ప్రజా పిర్యాదుల పరిష్కార హాలులో భవ్యా, చేట్టినాద్ సిమెంట్ ఫ్యాక్టరీలు, గ్రామస్తులు మరియు అధికారులతో జిల్లా కలెక్టర్ .ఆరుణ్ బాబు యస్పి. కంచి శ్రీనివాసరావుతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా అబివృద్దికి పరిశ్రమల అవసరం చాలా ముఖ్యమన్నారు. పరిశ్రమలకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. భవ్యా, చేట్టినాద్ సిమెంట్ పరిశ్రమలు ఉన్న తంగేడ, పెదగార్లపాడు ప్రదేశాలలోని పొలాలు రైతులు నష్టపోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామస్తుల తరపున జానీ భాషా, సి.వి.రావు లేవనెత్తిన 5 ప్రధాన అంశము లపై సంబందిత రెవిన్యూ, పంచాయతి రాజ్,సర్వే, వ్యవసాయ, ఉద్యాన మరియు హౌసింగ్ తదితర శాఖలతో కమిటిని ఏర్పాటు చేయడం జరిగందని, కమిటి క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదికను 10 రోజులలో అందించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. నివేదిక ఆధారముగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కంపెనీల యజమాన్యాల ప్రభుత్వ అధికారులకు సహకరించాల న్నారు. మెడికల్ క్యాంపులు ఆయా గ్రామాలలో నిర్వహించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. కంపెని యాజమాన్యాలు ఆయా ప్రాంతాలలో రైతులు పండిస్తున్న పంటలపై అధ్యయనం చేయాలన్నారు. యస్.పి.కంచి శ్రీనివాసరావు మాట్లాతూ పరిశ్రమల యానమాన్యం స్థానిక ప్రజల మనసు దోచుకొనే విధంగా పలు చర్యలు చేపట్టాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. గ్రామస్తులలో నమ్మకం ఏర్పడేలా చూడాలన్నారు.ఈ కార్యక్రమములో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే,జిల్లా రెవిన్యూ అధికారి మురళి, గురజాల రెవిన్యూ డివిజినల్ అధికారి మురళీ, జిల్లా పరిశ్రమల అధికారి రవీంద్ర, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి నజీన బేగం, జిల్లా పంచాయతి అధికారి భాస్కర రెడ్డి,జిల్లా వ్యవసాయ అధికారి మురళి,ఉద్యాన వన శాఖాధికారి రమణారెడ్డి, హౌసింగ్ శాఖ పి.డి. వేణుగోపాల రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version