నారద వర్తమాన సమాచారం
ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలో జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
బెల్లంకొండ
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నందు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయుష్ వైద్యాధికారి ఆర్. శ్రీనివాస్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి పూలతో ఘన నివాళి అర్పించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ బాపూజీ గా ప్రసిద్ధి చెందాడని, ఒక భారతీయ స్వాతంత్ర్య కార్యకర్త మరియు రాజకీయ నాయకుడు అని తెలియజేశారు. షెడ్యూల్ కులాల వంటి అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అన్నారు. భారత పార్లమెంటులో అనేక శాఖల మంత్రిగా మరియు భారత ఉప ప్రధానిగా పనిచేశారని తెలియజేశారు.. మీరు కూడా చక్కగా చదువుకొని ఇటువంటి మహనీయుల బాటలో నడవాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దబాబు , ఉపాధ్యాయులు, ఆయుష్ సిబ్బంది వెంకటరామయ్య, యోగా టీచర్ భూక్య హనుమంతరావు నాయక్, విద్యార్థులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.