నారద వర్తమాన సమాచారం
పలు మండలాల్లో జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించిన పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ బాబు ఐఏఎస్
మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ శ్రీ పి అరుణ్ బాబు ముప్పాళ్ళ మండలం మరియు సత్తెనపల్లి మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. తొలిత ముప్పాళ్ళ మండలం మాదాల గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో ముచ్చటించారు. వేతనాలు సక్రమంగా అందుతున్నాయా అవసరమైన వసతులు ఉన్నాయా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సత్తెనపల్లి మండలం నందిగం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పశువులకు దాహార్తి తీర్చేందుకు నీటి తొట్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డ్వామా పిడి సిద్ద లింగమూర్తి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు……
Discover more from
Subscribe to get the latest posts sent to your email.