నారద వర్తమాన సమాచారం
నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించిన నరసరావుపేట పట్టణ డిఎస్పి కె నాగేశ్వరరావు.
స్థానిక పల్నాడు బస్టాండ్ వద్ద గల బైపాస్ రోడ్డు లోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఈరోజు ఉదయం రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిహెచ్ కిషోర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంచినీటి చలివేంద్రాన్ని నరసరావుపేట పట్టణ డిఎస్పి కే నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది.
ఈ ప్రాంతంలో ఈ చలివేంద్రం అటు ఇరు పోలిస్టేషనులకు వచ్చు వారికి సమీప బస్టాండ్ ప్రయాణికులకు ఆ ఏరియాలో ఉన్న విద్యార్థులకు వాహనదారులకు ఈ చలివేంద్రం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ ఎండలకు విపరీతమైన తాపం దాహం తీరే విధంగా ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని భావించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బోరుగడ్డ అంబేద్కర్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు మాల మహానాడు, గ్రామాల ప్రజలు , బాటసారులు, విద్యార్థులు, పాల్గొని హర్షంవ్యక్తం చేయడం జరిగింది ..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.