నారద వర్తమానం సమాచారం
సింహాచలం ఘటన విచారణకు కమిటీ.. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వాలి: సీఎం చంద్రబాబు
సింహాచలం ఘటనపై ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై విచారణకు ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఈగల్ టీమ్ చీఫ్ ఆకె రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ ఇచ్చీఫ్ వెంకటేశ్వరరావును సభ్యులుగా చేర్చారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందజేయాలని కమిటీని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.