నారద వర్తమాన సమాచారం
కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జ్ నాయకులతో సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే యరపతినేని
పిడుగురాళ్ల :-
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు గురజాల నియోజకవర్గం పరిధిలోని మండల కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, నాయకులతో సమీక్షా సమావేశంలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో 02-05-2025 అనగా శుక్రవారం నాడు నవ్యాంధ్ర సృష్టికర్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగనున్న అమరావతి రాజధాని పునః ప్రారంభ కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలు నాయకులు యువత, మహిళలకు అవసరమైన ఏర్పాట్ల గురించి సమావేశంలో చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గురజాల నియోజవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి , గురజాల నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలకి చెందిన మండల పార్టీ కన్వీనర్లు,రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గం, మండల, గ్రామ, వార్డు స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు,క్లస్టర్ ఇంచార్జ్ లు, యూనిట్ ఇంచార్జ్ లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొనడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.