నారద వర్తమాన సమాచారం
తడి చెత్త పొడి చెత్త పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించిన కమిషనర్ పి. శ్రీధర్
పిడుగురాళ్ల:-
పిడుగురాళ్ల మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ పర్వతనేని శ్రీధర్ ఆధ్వర్యంలో సమక్ష సమావేశం జరిగింది
కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులకు సంబంధించి అన్ని వార్డుల శానిటేషన్ సెక్రటరీ లతో ఈరోజు 7/5/2025 న పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం నందు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్ని వార్డుల
శానిటేషన్ సెక్రటరీల అందరికి తడి చెత్త పొడి చెత్త వేరు చేపించి అలాగే శానిటేషన్ చేయడంలో ప్రత్యేక శద్ర వహించాలని ఈరోజు జరిగిన రివ్యూ మీటింగ్ నందు చెప్పడం జరిగినది.
కమిషనర్ తీసుకున్న ఇతర చర్యల గురించి తెలియజేసారు. మరియు పరిశుభ్రత, పారిశుధ్యం, మురికివాడలలో చెత్తను సకాలంలో ఎత్తివేయడం మరియు నివాస మరియు బహిరంగ ప్రదేశాలలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయడంపై మరింత దృష్టి పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అన్ని సచివాలయాలకు సంబంధించిన సెక్రటరీలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.