నారద వర్తమాన సమాచారం
జూరాల ప్రాజెక్టునుండీ 10 గేట్లను ఎత్తి 82 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేసినందున కృష్ణ నది తీరా గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
_ జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్.
నది వరదల దృష్ట్యా పోలీస్ యంత్రాంగాన్నికి పలు ఆదేశాలు జారీ చేసిన జిల్లా ఎస్పీ
జూరాల ప్రాజెక్టునుండీ 10 గేట్లను ఎత్తి 82 వేల క్యూసెక్కుల నీటి విడుదల చేసినందున కృష్ణ నది తీరా గ్రామాలు అయిన బిరెల్లి, తెలుగొనిపల్లి , ముక్కల పల్లి, ల, బస్సాపురం, బీచుపల్లి తో పాటు ఇతర నది తీరా గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ తెలిపారు.
ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటక లో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్నదనీ, ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండడంతో జూరాల ప్రాజెక్టులో 10 గేట్లను ఎత్తి 82 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు శ్రీశైలం ప్రాజెక్టుకు వదలడం జరుగుతుందని కావున నది తీరా గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చేపలు పట్టే వారు, పశువులు , గొర్రెల కాపరులు నదిలోకి వెళ్లవద్దని జిల్లా ఎస్పీ తెలిపారు.
జూరాల ప్రాజెక్టు నుండి ఎక్కువ మొత్తంలో నీరు విడుదలవుతున్న దృష్ట్యా సంబంధిత పోలీస్ అధికారులను తగిన ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండటం తో పాటు గ్రామాలలో టామ్ టామ్ వేయించి ప్రజలకు తెలియజేయాలని ఆదేశించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.